పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జగతిపై మానగాంభీర్యసత్యరూప, గరిమలను గొంక యెనవత్తు రరసి చూడ
శ్రీశపాదాబ్జసేవాసమృద్ధుఁ డైన, మంత్రి తిప్పయకొండనామాత్యునకును.

29


క.

ఆకొండమంత్రిమణికి శు, భాకృతిఁ జెన్నొందుమల్లమాంబకు రామ
శ్రీకృష్ణులగతిఁ బుట్టిరి, ధీకలితులు సరసవిభుఁడు దిమ్మఘనుండున్.

30


ఉ.

కొండయదండనాయకునికూరిమితమ్ముఁడు నాగరాజు మా
ర్తాండుఁ డఖండతేజమున నంబుజవైరి సమగ్రకాంతి నా
ఖండలమూర్తి భోగమునఁ గర్ణుఁడు దానమునన్ లతాంతకో
దండుఁడు రూపసంపదల ధైర్యమున న్సురశైల మారయన్.

31


క.

ఆనాగమంత్రివరునకుఁ, బ్రాణపదం బైన దేవమాంబకు దానే
దానీంతనకానీనుం, డోనాఁ దగి చెన్నశౌరి యుదయము నొందెన్.

32


సీ.

ఆమంత్రిపుంగవుం డష్టభాషాకవివర్యుఁడై పొగడొందె వసుధయందు
ద్విపదగా నారసింహపురాణ మొనరించి భక్తి నహోబలభర్త కిచ్చె
బాలభారత మంధ్రభాషను వచనకావ్యంబు చేసెను గవీశ్వరులు మెచ్చ
సౌభరిచరితంబు జక్కులకథ చెప్పే లాలితననరసాలంకృతముగ
మఱియుఁ బెక్కుకృతు ల్పటుమతి రచించె, ఖ్యాతి నరసింగరాయలచేతఁ గొనియె
నగ్రహారంబులును వివిధార్థములును, వెలసె గొండమఁ బెండ్లియై విభవమెసఁగ.

33


క.

ఆచెన్నయమంత్రికిఁ బు, ణ్యాచారకుఁ గొండమాంబ కంచితనీతి
న్వాచస్పతితుల్యుఁడు వి, ద్యాచతురాననుఁడు నరసనాఖ్యుఁడు పుట్టెన్.

34


గీ.

తిప్పయామాత్యు కొండమంత్రికిని బుణ్య, సాధ్వి యగుమల్లమాంబకు సకలభాగ్య
సహితులై యుద్భవించిన మహితకీర్తి,హారు లగునారసింహతిమ్మాఖ్యు లందు.

35


సీ.

శ్రీమదహోబలస్వామిపాదాబ్జము ల్మరగించినాఁ డాత్మమధులిహమును
దానాంబుధారల ధారణీసురదైన్యకర్దమపుంజంబుఁ గడిగినాఁడు
సత్కీర్తిమల్లికాసౌరభ్యములను వైరించాండపేటి[1] వాసించినాఁడు
చండప్రతాపమార్తాండమండలిచేత ధూర్తారితుహినంబుఁ దోలినాఁడు
ప్రణుతి యొనరింపఁ దగదె నృపాలసభలఁ, బరమభాగవతోత్తము భవ్యచరితుఁ
జారుతరపుణ్యగణ్యు నీసకలదండ, నాథకులసింహుఁ గొండయనారసింహు.

36


మ.

పరకాంతామణిఁ దల్లిగా మనమున న్భావించు నేవేళ నె
వ్వరితో బొంకఁ డొకప్పు డన్యధనము ల్వాంఛింపఁ డశ్రాంతమున్

  1. వైరించాండపెట్టి - మూలము