పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధూపదీపంబు లడఁగె దుత్తూరగోక్షు, రకలితార్కనికుంజపూర్ణంబు లగుచుఁ
[1]బాపరిండ్లయ్యె గుళ్ల యభ్యంతరంబు, లాతఁ డధికార మొనరించునవసరమున.

152


క.

సురభూసురపీడనమునఁ, బొరసిన విత్తంబు వానిఁ బొందక పెఱకై
సురిగె నొకకొంత వేశ్యా, శరణములకుఁ గొంత చోరజనవశ మయ్యెన్.

153


గీ.

చెట్టుఁ దిన్నపురుగుఁ బట్టి పీడించినఁ, బసరు వెడలుగాక పసిమి గలదె
దూఱు దక్కెఁ గాని దుర్బ్రాహ్మణునకును, నార్జితార్థకోటి యంట దింత.

154


క.

త్రిచతుర్వర్షములకు నీ, ప్రచయము దేవాలయంబు ప్రజలు నొకటి యై
కుచరిత్రుఁ డైనమందే, హుచరిత మాభోజపతికి నొగి నెఱిఁగింపన్.

155


వ.

కాలాకారుండై యభ్భూపాలుండు కోపించి యాకాపురుషు రావించి వాని
వలన దేవతాసేవకులును భూదేవనివహంబునుం గలుగరూపించిన యపరా
ధంబు సైరింప నేరక చక్షుర్దండయోగ్యుండ యేనియు నయ్యయోగ్యు నప
విత్రాంకకళంకాంకితశరీరుం గావించి తనయేలుభూవలయంబునకుం బాపు
టయు నాపాపస్రవణుండు.

156


క.

బహుదేశంబులవెంటన్, బహిష్కృతుం డగుట మాటుపఱిచి చరించున్
మహిసురచండాలుఁడు స, ద్గృహమేధుల యిండ్లఁ దిండి దినుఁ బలుమాఱున్.

157


గీ.

జఘనకీలితసలిలకషాయపటము, నుత్తరీయంబు మెడవంపు నొరగుశిఖయు
నిటలమున గంగమట్టియు నీరపూర్ణ, కుండికయునై చరించుఁబాషండుఁ డతఁడు.

158


చ.

అతఁ డట నొక్కనాఁడు విపినాంతకమార్గమునందుఁ బోవుచుం
బ్రతిభయభానుదీధితులఁ బర్వినదాహము నోర్వలేక శీ
తతరజలంబు నారయుచుఁ దత్సవిధంబునఁ గాంచె నొక్కహం
సతుములమాంసలంబు జలజాతనివాసముఁ జారుహాసమున్.

159


వ.

కాంచి యానష్టపూర్వద్విజుండు సంతుష్టహృదయుండై యథేష్టంబుగ నక్కొ
లన జలజపరాగపరంపరావాసితంబులు నతిశీతలంబులును మధురసుధారస
ప్రాయంబు లగుతోయంబు లాని మేనికిం దనుపు వచ్చుటయు నచ్చట
వియచ్చరతరునిభం బగు సురపొన్నగున్నమ్రానినీడం గోడెవయసు విపిన
పవనశిశువులు విసర సొగపు నొందుచుఁ గొంతతడవు మార్గశ్రాంతి నపన
యించుచు నుండి నప్పుడు.

160


సీ.

ముదురుచీఁకటినిగ్గుమ్రుగ్గులన్నియుఁ గూడి నిలిచెఁ బొమ్మననొప్పు వలుదకొప్పు
పైపొర తనుదానె పాయ వెలుంగొందు ముగ్ధచంద్రుని బోలు మొగము మేలు

  1. పాపయిండ్లయ్యె