పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 5-6

నారసింహపురాణము. ఆ 5

335


యెవ్వ రెటువలె బోధించి రేధమాన, శేముషీగౌరవంబునఁ జిక్కఁబట్టి
యంతకంతకు నతఁడుకామాంధకార, కలితలోచనుఁ డగుఁగాని కాఁడు సుమతి.

133


క.

కుసులకు విఱిగిరి దుష్ట, వ్యసనము విడలేక తిరుగువానిపయిన్ భ్రా
తృసమూహంబును బాంధవ, విసరము గురుజనులు గూర్చు వియ్యపుఁబ్రజలున్.

134


గీ.

ఉరగదష్టాంగుళముఁ ద్రుంచి యుఱకపాఱ, వైచుకైవడి నన్నీచు వదలవిడిచి
యింటివారెల్ల సుఖముండి రంటుకొనిన, తెవులువాసినకరణి నోధీరచరిత.

135


శా.

ఆమందేహుఁడు బంధుముక్తుఁ డయి చింతాక్రాంతసంతాపమూ
ర్ఛామగ్నాశయుఁ డై చరించుటలు కర్ణాకర్ణిన్ భోజధా
త్రీమందార మెఱింగి వానిఁ గరుణాదృష్ణి న్నిరీక్షించి శి
క్షామంజూక్తుల బుద్ధి చెప్పి నిజాపార్శ్వస్థాయిగాఁ జేయుడున్.

136


క.

రాతిరి పగలును వినయో, పేతుం డై సేవ చేసెఁ బృథివీనాథుం
బోతర ముడిగి మహీసుర, సూతి మధుచ్ఛన్న మైనసురియయుఁ బోలెన్.

137


వ.

ఇట్లు విష్ణుశర్మమీఁది కూర్మికతన భోజుం డావిప్రతనూజుం బాటించుచు నుండి
కతిపయసంవత్సరంబు లరిగినం దదనంతరంబ యొక్కకందువయందు.

138


క.

ఆమందేహున కిచ్చెన్, భూమీవిభుఁ డగ్రహారములకును దేవ
గ్రామంబులకును సమమతి, వై మేరలు నడుపు మనుచు నధికారంబున్.

139


గీ.

ఇచ్చి ముద్దుటుంగ్ర మిచ్చి వారక మిచ్చి, యందలంబు వెట్టి యనుచుటయును
గుజనుఁ డతఁడు బ్రహకూఁకటి ముట్టి భూ, పాలు వీడుకొని యపారముహిమ.

140


మ.

కరణంబు ల్పరిహాసకు ల్కవిజను ల్కార్తాంతికు ల్గాయకు
ల్దొరపోతు ల్పరివారము న్సఖులు మంత్రు ల్కర్తకర్మజ్ఞులుం
దెరువు ల్వెట్టి పదార్థము ల్దిగుచు యుక్తిప్రౌఢులు న్మున్ను ము
ష్కరు లెల్లం దనవంటివారు గొలువంగా సంభృతోత్సాహుఁడై.

141


క.

సురభూసురభూములపై, హరిణాశ్రితవనము సొచ్చు వ్యాఘ్రమపోలెన్
ధరణీసురసూతి క్రుమ్మరి, పరుసఁదనము మీఱఁ బారుపత్తెము సేయున్.

142


సీ.

పూర్వంపుటధికారిపురుషులమీఁది ముత్తండలన్నియుసు జిత్రముగ నొడిచి
వాచాలు రగుచుఁ జావడి నిరంకుశవృత్తిఁ దనరుగ్రామణులకు జనవు లొసఁగి
సందుగొందులను లంచపుముఖంబున మాటుపడు నపరాధంపుబెడఁద లరసి
యొక్కని వెఱపించి యొక్కని మన్నించి యొకఁడు గానకయుండ నొకనిమనవి
చనవు లేకాంతమున విని సకలజనులఁ, గైవసంబుగఁ జేసె భూదేవదేవ
సీమవారల నాధూర్తశేఖరుండు, రేయుఁ బవలును గనుఱెప్ప వేయికిట్లు.

143