పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యెఱుంగక కన్నులు మూయుచుఁ దెఱచుచు నొకవింతసంతోషంబు
వహించి, గోవిందదర్శనంబు సేయు నతని యవబోధంబు క్షణంబు
గాన్పించుచు, క్షణం బతిరోధానంబు నొందుచు, సాభ్రవ్యోమేందు
మండలంబుగతిఁ బ్రకాశించె; నంతం జూచి క్షణంబు చింతించి “యితని
వాక్కునఁ బృథివియు నగ్నియు నితని ప్రాణంబున నంబరంబు నని
లంబును, నితని చక్షువున రవియు దివియు, నితని శ్రోతంబున దిశలు
శశియు, నితని మనంబున నంబువు, వరుణుండునుం దగుటఁ జూచి
శ్రీమద్విభూతిం దనరు నితండు సర్వోపనిషదర్థంబు, మహాప్రభు” వని
పునఃపారవశ్యంబు గాంచి తెలిసి శ్రీశాంకశాయియైన తన్నుం దడవుటకు
నెఱింగి భయసంభ్రమంబుల లేచి ప్రసన్నుండవు కమ్మని మ్రొక్కి
బహుయంజ్ఞుండై యల్పపూజోక్తి నాచరింపండయ్యె; నప్పుడు గదా
పద్మాసిశంఖధారి యభయహస్తం బిచ్చి చేపట్టె; స్పర్శసుఖైదితంబైన
భుజంబున నిడికొనినఁ గరాబ్జస్పర్శనాహ్లాదగళదశ్రుండై కంపంబు
నొంద మఱియు నిట్లనియె.

235

విష్ణువు ప్రత్యక్షమై ప్రహ్లాదు ననునయించుట

చ.

"గురుతరమూర్తి నంచు" ననుఁ గూర్చి భయంబును సంభ్రమంబు వే
మరుఁ దగదీకు నిట్టిది సమస్తము నాకు ప్రియంబు గాదు మ
త్పరమహితంబు సేయుట యభవ్యము సేవ్యముఁ, బూర్ణకామ్యతం
బరిగిన నాయెడ న్నిలిచి పల్కిన పల్కులు నాకు హృద్యముల్.

236


తే. గీ.

సతతముక్తుండ నయ్యుఁ బ్రసన్నభక్త,
భక్తి సుస్నేహరజ్ఞుప్రబద్ధబుద్ధి
నైతి; నజితుండ నయ్యు జితాత్మ నైతి;
వశ్యకృత్యుండ నైతి నవశ్యమహిమ.

237


తే. గీ.

త్యక్తబంధుధనస్నేహతంతుఁ డగుచు
నెమ్మి నాయందు సద్భక్తి నిలుపవలయు;
నతఁడు నాకును మరియు నే నాతనికిని
గాన మా కెవ్వరు నిజాప్తఘనులు లేరు.

238


వ.

నిత్యుండును బూర్జకాముండును నగు నాకు జన్మంబులు వివిధంబులు
గలవు; సర్వేష్టదానంబు లొసంగుదు; నీకు నెయ్యది ప్రియం బది తెలుపు“