పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అసుర లహిపాశబంధమగ్నాంగుఁ జేసి
నిన్ను నాలోన వైచిన నిర్మలాత్మ!
నిప్పు మ్రింగిన నరునట్ల నిన్ను నాదు
గర్భమున నుండి త్రోచితిఁ గడకు నిపుడు.

233


క.

ఉరగవరపాశబంధము
లురగాహితుఁ డుక్కడంచె నుగ్రోద్ధతిమై;
హరిభక్తి పుణ్యసంపదఁ
బురుషులకు లభించవే యపూర్వయశంబుల్.

234


వ.

అని రత్నంబులు సమర్పించి "హరిం బూజించి; హరిభక్తుల నుపేక్షిం
చినవారికిఁ బరమధామంబు దూరంబు; రత్నోపాయనంబులచే నీకుఁ
గర్తవ్యం బెద్దియు లేదు భా........................................................
[1].........................................................................................
దెరచుకొని ప్రసన్నవదనుండును; గమలాయతాక్షుండును, దీర్ఘ
బాహుండును, సుకపోలనాసికాభాగుండును, నుదారతేజోనిధియు,
నప్రమేయుండును, గదాసిశంఖాంబుజశోభనాంగుండును, సుదృశ్య
సీమాపరసేతుభూతుండును, సర్వేంద్రియాహ్లాదనదివ్యమూర్తియుఁ,
ద్రిలోకీవితతప్రతిమూలంబును, గురుపరమగురుండును, నాథ
నాథుండుమ నగు విభునిం జూచి విస్మయభీతిహర్ష ప్రకంపంబు లంది,
యది స్వప్నంబుగాఁ దలఁచి స్వప్నంబునందేని యీశ్వరసాక్షా
త్కారం బయ్యెడునని, ప్రహర్షార్ణవమగ్నచేతస్కుండై మఱియు
నానందమూర్ఛం జెందిన, నీశ్వరుండు ధరణియందుం జేర్చి యంకం
బున నిడుకొని, నర్వజనైకబంధుండు గాన మెల్లనె కదల్చి కరపల్ల
వంబునన్ స్పృశించి, మాటికి, జననియుంబోలె నాలింగనం బొనర్చినఁ
గొంతసేపునకుఁ ప్రహ్లాదుండు కన్నులు తెఱచి విస్మయానిమేషుండై
జగన్నాథుం దప్పక చూచిన సుధామాధుర్యసారంబులైన వాక్కుల
“వత్సా! భయంబు నొందకు" మని యూఱడించినఁ గృష్ణాంగస్పర్శ
సౌరభ్యసురూపవచనామృతంబులచే నక్షగణంబు హృతంబైన
యాత్మసంభావనంబు నొందక నిజమనోభృంగంబు పరువెత్తె; శ్రీశ
భక్తాబ్జసంగియై యతిలుబ్ధంబై న; నే నెవ్వండ నెచట నున్నవాఁడ” నని

  1. ఇక్కడ ఒకపేజీ వచనము మధ్యలో లేదు.