కనిపిస్తున్నది. కాని వాస్తవానికి నరసింహకవి ఆ పాదాన్ని హస్తములఁ బట్టి బిరబిర నార్చి ద్రిప్పి అని రచించివుంటాడని ప్రతివ్రాసిన వ్యక్తి పొరపాటున మాటలను ముందువెనుకలుగా మార్చి వ్రాశాడని భావించవలసివున్నది.
నరసింహకవి కొన్నిసందర్భాలలో అసాధారణమై ప్రాచీనకవులచేత సకృతులుగా ప్రయోగించబడి లాక్షణికులు గుర్తించనటువంటి కేవలస్వరయతిని కూడా ప్రయోగించాడు.
| "తరులతాకుంజఖగమృగతతుల నడిగి | |
(నార. 3-. పు. 169. ప.)
ఈ పైతేటగీతిలోని రెండవపాదంలో గగనశబ్దగతమైన తొలి 'గ' కారంలోని 'అ' కారానికి "తేజో౽౦తర" అన్నప్పుడు పూర్వరూపసంధిలో గూఢమై వున్న 'అంతర' శబ్దంలోని 'అ' కారానికి కేవల స్వరయతిగా విశేషయతి ప్రయోగం చేయబడింది.
నారదీయపురాణం 100వ పుట 35వ పద్యమయిన సీసంలోని యీ క్రింది రెండవపాదంలో
| "అన్యగాథలు మాని నారాయణుని నభో | |
నభోభ్యంత అన్నప్పుడు 'భ్య'లోని 'య'కారానికి 'గానం' అన్నప్పుడు 'న' వర్ణంలో 'అ' కారానికి కేవలస్వరయతి ప్రయోగించబడింది. ఈసందర్భంలో అభ్యంతరశబ్దాన్ని 'అభి + అంతర' అని విభజించినప్పటికి కూడా ఉపసర్గయతి దృష్ట్యా 'అంతర' లోని అకారస్వరానికి యతివేశాడని అనుకొన్నా 'న' వర్ణంలోని కేవల అకారస్వరానికి మాత్రమే యతిమైత్రిని పాటించాడని మనం ఆమోదించకతప్పదు.
| "అలఘులు వీతరాగులు ................................... లా | |
(నార. 376. పు. 240. ప.)
అన్న చంపకమాలలో మూడవపాదంలో యతిమైత్రిలో 'ద' కార 'బ' కారాలకు అసలు సంబంధం లేనేలేదు. "ద్యు"లోని 'యు'వర్ణానికో 'ఉ'స్వరానికో "బూ" లోని 'ఊ'కారంతో కేవలస్వరయతిని నరసింహకవి ప్రయోగించాడని మనం విస్పష్టంగా గుర్తించవలసి వున్నది. ఇదేవిధంగా యీ క్రింది తేటగీతి మూడవపాదంలో,