పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

621


దుర్యోధనాదుల దుర్మదాంధులను
గ్రౌర్యచిత్తులఁ బాపకర్ముల శఠుల
నతుల కృతద్రోహులైన దుర్జనుల
మతిహీనులను మహామర్త్యనిందితుల."
ననుచు భీముఁడువల్క ; నా వేళయందుఁ
గనలి యర్జునుఁడును గడువడిఁబలికె:
"అంగజారికిని బాణాననంబైన
బంగారుకొండ నిర్భరరుచిమించు
కమనీయ మత్కర కాండానన-----
సమరరంగంబునఁ జంపుదు నేను
గర్ణాది దుర్జనాగ్రణుల నందఱను
నిర్ణయంబుగ దేవనివహంబు వొగడ.”
అనుటయు నకులుండు నధికరోషమున
గొనకొని పలికె: " నాకుంతంబుమొనను
సకలకౌరవసేనఁ జంపుదు నేను
నకలంకవృత్తి నుగ్రాహవంబునను."
అనిన సహాదేవుఁ డలిగియిట్లనియె:
“మును గపటద్యూతమున మమ్మునోర్చు
పాపాత్ము శకుని నాబాణజాలమున
నేపారఁ దునుముదు నిందఱునెఱుఁగ."
ననుచు నతిప్రతిజ్ఞారూఢులగుచు
ఘన కరిపురము వేగంబున వెడలి
పాండవేయులు పోవఁ, బటుధృతరాష్ట్ర
మండలాధీశ్వరుమందిరంబునను
నుదురుచు గోమాయువులు పట్టపగలు (?)
బెదరుచు నఱచెను భీషణంబుగను;
అప్రదక్షిణముగా నగ్నులువెలిగె;
నప్రియంబుగఁ బల్కె నాకాశవాణి ;