పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

620

ద్విపద భారతము.


ననుచు దుఃఖింపుచు నాకుంతి దేవి
ఘనుని సహా దేవుఁ గనుఁగొనిపలికె:
"అన్నలతో నీవునరిగెదవయ్య!
యున్నత శైలమహోగ్రాటవుల,
ఒక్కఁడ వీవైన నుండితివేని,
తక్కక తనయులందఱు నుండినట్ల
నాకు నెమ్మదిని మానసముండు." ననుచు
శోకించి ద్రౌపదిఁజూచి నేత్రముల
వారిధారలుగ్రమ్మ వరుస నిట్లనియె :
"సారసనేత్ర, పాంచాలువంశమును
బాండుకులంబును బ్రబలె నీకతన
దండిఁబుట్టుటను మోదమునఁజొచ్చుటను
పురుషగోరాజులు భూనుతపుణ్య
పురుషులు ఘనులు నీపురుషులు ; వీరి
చిత్తముల్ రాగిల్ల సేవలుచేయు
సత్తుగా భయభక్తిశక్తియుక్తులను. "
అని కుంతి దేవియు నా వేళయందుఁ
దనకు మ్రొక్కినయట్టి ద్రౌపది సాధ్వి
నాలింగనముచేసి యలర దీవించి,
చాలను బుత్త్రుల సరవి దీవించి,
సదయాత్మయైయుండె సాధ్వీలలామ
విదురుమందిరమున వెసవారు వినఁగ.

పాండవుల ప్రతిజ్ఞలు

అమితపరాక్రమాభ్యధికుఁడైయున్న
యమసూతితో భీముఁడపుడిట్లుపలికె:
"సాహసంబున రణస్థలమున నాదు
బాహుగదాహతిఁ బగఱఁజింపుదును