పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

581


దండప్రమాణంబు తగనాచరించి
నిండినభక్తితో నెఱినుండుతఱిని
....... ....... ....... ........ ......... ........
....... ........ ........ ........ ....... ........
ఇందీవరాక్షిని నిభరాజగమనఁ
గుందేందురుచిని సద్గుణగణశీల
నలినీలవేణిని నబ్జసంభవుఁడు
చెలువుగా జగములఁ జిత్రంబుగాను
శృంగారలక్ష్మిగాఁ జేసె నేరుపున ;
నాంగికమైన యాయంగనఁబోల
సతులులేరని చాలసన్నుతిసేయు
చతురతయొప్పె నాసమయంబునందు.
అంతఁ బాండవులును నాదినంబుననె
సంతోషచిత్తులై సంభ్రమంబునను
ఆసీనులై యున్న యాసమయమున
నాసుయోధనుఁడు దా నప్పుడిట్లనియె:
“ధర్మనందన, నీకు దాక్షిణ్యనిధికి
ధర్మవర్తన వినోదంబు జూదంబు ;
ఆడుద" మనవుడు నతఁడునిట్లనియె:
"నోడక జూదమిట్లొగి నాడవలదు ;
జూదంబు వాదంబు సుజనఖేదంబు;
...... ....... ....... ....... ........ ....... ....
ఇదిదోషమాడంగ నేపారవినుము
పదహీనులగుదురు బహుళదుఃఖములఁ
బొందుచుండుదురు భూభువనంబునందు.
నందందు ధరణి మాయాద్యూతమునను
అడరంగఁ బాతకంబండ్రు మానవులు ,
ఎడర ధర్మద్యూత మిరవొందఁజేయ