పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

582

ద్విపద భారతము.


ధర్మంబుగలుగును దఱ్వార్థముగను
నిర్మలమతినని నెఱిదేనలుండు
చెప్పినాఁ." డన యుధిష్ఠిరునకు శకుని
యప్పుడిట్లనియె నాహ్లాదంబుతోడ :
"నిందింపఁదగునయ్య, నీకు జూదంబు !
లెందును బలవంతు లితరులగెలుతు.
రయ్య, జూదంబునీ వాడలేవేని
చయ్యనఁ గదలుము, శాంతంబువలదు
నన ధర్మజుండును నతనికిట్లనియె:

థర్మరాజు శకునితోజూదమాడుట

"మునుకొని బలవంతు మునుసభాస్థలిని
జూదమాడంగను సొలవకపిలువ
నాదట నాడక యటుచననగునె!"
యనుచుఁ గర్మము దన్నునటుచుట్టుకొనఁగ
వినయోక్తులందును వేడ్కనిట్లనియె:
"ఎవ్వరు నాతోడ నిటుజూదమాడ
నివ్వేళఁ బూనుదు రిటచెప్పు?” డనిన
రాజరాజకిరీటరత్నంబు ధర్మ
రాజునకును గురురాజు తాఁబలికె:
"మామామ శకుని ప్రేమమున నీతోడ
నేమంబులందును, నెత్తంబులాడు ;
నొడ్డినధనమెల్ల నొనర నేనిత్తు
దొడ్డగా నాడుము దురితవిదూర. "
అని తనచేతిరత్నాభరణంబు
గొని యొడ్డినను జంద్రకులధర్మజుండు
దివ్యభూషణము వార్ధిసముద్భవంబు
భవ్యంబుగానొడ్డి పరఁగి యుండగను,