పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

567


పాండవాభ్యుదయమునకు దుర్యోధనుఁ డసూయవడుట

"జననాథ, పాండవక్ష్మాతలేశ్వరుల
భాగ్యభోగంబులు పర్జన్యుకంటె
యోగ్యమైయున్నవి యున్నతంబగుచు ;
సకలదిక్కుల వారిసత్ప్రతాపములు
వికటమైచూపట్టి వెలసెను బేర్మి ;
నరుఁడు విక్రమశాలి నయగుణోన్నతుఁడు
పరరాజ్యవిజయుండు బలసమగ్రుండు
కొమరొప్ప నుత్తరకురుభూములాది
యమర దేశములెల్ల, నర్థి సాధించె ;
శక్రుండు ద్రుపదరాజన్య శేఖరుఁడు
చక్రధరుండును జగతిలోఁ దక్కఁ
దక్కినరాజులందఱుఁ బాండవులకు
మ్రొక్కి యప్పనము లిమ్ములఁ బెట్టువారె;
కాని, కొల్వనివారిఁగానము జగతిఁ
గానన శైలసంఘ ద్వీపములను.
వనధి వేష్టిత చక్రవాళమధ్యంబు
ననురక్తితో నేలె నఖిలంబుఁ బొగడ.
నేనొకరాజనా యీమహీస్థలికి !
దీనిఁజూడఁగఁజాల; దిక్కు లెఱుంగ
ధర్మనందనుఁడు రత్నపరిగ్రహంబు
పేర్మి సేయఁగ నన్ను బెద్దయుఁ బనిచె.
నేనునుజూచితి నెసగ నమ్మణుల
భూనాథ, యేజగంబులఁగాన నెందు.
యజ్ఞదీక్షితుఁడైనయమనందనునకు
విజ్ఞానవంతులు విశ్వభూవిభులు