పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

568

ద్విపద భారతము.


కాంభోజపతులు ఉత్కటరథంబులును
జృంభితహయములు నింధురావళులుఁ
దెచ్చియిచ్చిరి మహాతేజంబుతోడ ;
మెచ్చి శ్రీకృష్ణుండు మెలఁకువతోడఁ
దరుణార్కరుచుల రథవ్రాతములును
దురగరత్నములు బంధురరత్నములును
బదునాల్గు వేలు నిర్భరగజేంద్రములు
ముదముతోఁ బాండవముఖ్యునకొసగె.
నవరత్నములు సువర్ణములు గంధములు
వివిధాంబరంబులు వేడ్కతోడుతను
గేరళ సింహళ కేకయ చోళ
శూరసేన సుపాండ్య శోభితనృపులు
ధర్మరాజునకు మోదమ్ముతోడుతను
అర్మిలినిచ్చిరి యధికలక్ష్ములను;
నరుఁడు నాద్యుండైననారాయణుండు
నిరువురు సుఖగోష్ఠి నేకతంబునను
వర్తింపుదురు మహావైభవంబునను ;
మూర్తితో ధర్మజుమూర్థాభిషిక్తు
కావిరాటుండు పరాక్రమోన్నతుఁడు
వేవేగమున రెండు వేలదంతులను,
వేడుక ద్రుపదుఁడు వెయ్యేనుఁగులను,
జూడనొప్పిన తమసురుచిరాశ్వములఁ
బదునాల్గువేలనుబటువిలాసినులఁ
బదివేలదాసులఁ బసనిచ్చిరపుడు,
గాంధార కేకయ కాంభోజ మద్ర
బంధుర కాశ్మీర బహుళకులూత
కురు మరు మాళవ కుంతల మగధ
కరహాట వంగాంగ కాళింగ నృపులు