పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

542

ద్విపద భారతము.


ప్రాజ్ఞుండు నయశాలి పాండవాగ్రజుఁడు
యజ్ఞదీక్షితుఁయ్యె నాగమోక్తులను.
రాజ తేజము విప్రరాజ తేజమును
రాజిత నవరత్న రాజి తేజమును
గల ధర్మసుతుని లోకములవారెల్ల
నలరుచుఁ జూచిరి యద్భుతంబంది.
బ్రాహ్మణో త్తమ మణిప్రకరంబునడుమ
బ్రహ్మతేజంబున బ్రహ్మయుఁబోలి
యుండంగ నవ్వేళ యురువినోదముల
మండలేశ్వర..... ...... ....... ...... .......
భూసురాశీర్వాద పుణ్యనాదములు
భాసిల్లఁజేయుచో బహువిధంబులను
బంచమహాశబ్ద పటునినాదములు
నంచితంబై మ్రోసె ; నాసమయమున
ధౌమ్యుండుఁ బై లుండుఁ దగినహోతలుగ,
సౌమ్యుండు నిగమార్థ చతురుండు ఘనుఁడు
యాజ్ఞవల్క్యమునీంద్రుఁ డధ్వర్యుఁడుగను,
సుజ్ఞానుఁడైన వ్యానుండు బ్రహ్మగను,
......... ......... ......... ........ ........ .........
పూతనారదముఖ్య పుణ్యమౌనులును
రాజిత భీష్మాది రాజశేఖరులు
నోజతో సభ్యులై యున్నతిఁగొలువ,
నభిరామ సర్వక్రియా సమగ్రముగ
శుభకరంబుగ రాజసూయయాగంబు
సువ్రతంబుగఁజేసి, సొంపుమీఱంగఁ
దీవ్రార్క తేజుఁడై త్రిజగంబుఁబొగడ
వేదవిప్రులకును వివిధ దానములు
మోదంబుతోఁజేసి, మునివరేణ్యులకు