పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

543


ధరణీసురులకు భూతలనాయకులకు
మఱియును వర్ణాశ్రమములవారికిని
నమితదానంబులు నన్నదానములు
గ్రమముతోఁ జేసెను ఘనధర్మసుతుఁడు."
అనుచు సభాపర్వమందలికథలు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించె శాస్త్రోక్తివిఖ్యాతముగను
మునిసమూహంబు లిమ్ములఁ బ్రస్తుతింప.
భానుకులాంభోధి పావనచంద్ర,
భానుకోటిప్రభా భాభాసమాన,
యంజనాత్మజలోల, యతికృపాశీల,
మంజీరయుతపాద, మధురప్రసాద,
శరముఖాకర్షిత జలధికల్లోల,
ధరణిజాలింగన తాత్పర్యశీల,
బాణాసనాంకిత పటుభుజాదండ,
బాణభీకర శత్రుపటలసంహార,
అసమసాహిత్య విద్యాచతుర్ముఖుఁడు
రసికుఁడు బాలసరస్వతీశ్వరుఁడు
పసనొనర్చిన సభాపర్వంబునందు
నసదృశంబుగఁ బ్రథమాశ్వాసమయ్యె.