పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

514

ద్విపద భారతము.


ముసలియవ్వలువచ్చి ముదముతో వాని
నెసగిన భక్తితో నెత్తుకయుండ,
నట్టిసంభ్రమమున నాబృహద్రథుఁడు
తొట్టిన భక్తితోఁ దొలుత నేతెంచి
యతిరోదనము సేయు నాత్మసంభవునిఁ
జతురతఁ గనుఁగొనె సంభ్రమంబెసగ.
అవేళ రాక్షసి యబలరూపమున
భూవిభుమణితోడ బుద్ధినిట్లనియె:
"జరయనురాక్షసి జననాథ, యేను;
బరికింప నీపురీపరిఖచదుకమునఁ
బాయక యుండుదుఁ బ్రతిదివసంబు;
నేయెడ నీకు నేనిష్టంబు సేయఁ
గోరుచునుండుదుఁ గొంకక యెపుడు;
నేరుపుతోఁ జేయ నేడు సిద్ధించె.
నీయిరువురు తరుణీమణులకును
శ్రీయుతంబుగ జనియించినయట్టి మనుజ
శకలంబులివి రెండు చర్చించిచూడ;
నకలంకగతిఁదెచ్చి యట నిందువ్రేయ
నీ రెండుశలంబు లేను గూర్చినను
బోరన మనుజుఁడై భూరిసత్వమున
ఘనవజ్రకాయుఁడై కడఁగి కుమారుఁ
డనిమిషగిరివోలె నమరి యున్నాఁడు;
ఈకుమారకుని నీ వెత్తుకొ మ్మనుచుఁ
జేకొని జర భక్తిఁ జెప్పిన, వినుచు
నామగధేశుండు నాజరకనియె :
అమహాత్ముండు విశ్వామిత్రమౌని
నాకు వేడుకనిచ్చె నందను మునుపు;
చేకొని నీవు నిచ్చితివి నా కిపుడు;