పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

515


నాకులంబెల్ల నున్నతిని రక్షింప
నాకల్పమునఁ బుట్టినట్టి దేవతవు.'
అని దానిఁ బూజించి యాత్మనందనుని
గొనిపోయి దేవులకును నిద్దఱకును
సరభసంబుననిచ్చె సంతోషమునను.
జర వాని సంధింపఁజాలుటఁ జేసి
జననాథ, మఱి జరాసంధుఁడై యొప్పె.
మనుజేశుఁడేటేఁట మనుజాశనికిని
నుత్సవంబొనరించుచుండె; నందనుని
నుత్సాహమునఁ బెంచుచుండె; నంతటను
జండకౌశికుఁడు ప్రచండమునీంద్ర
మండలేశ్వరుఁడు నిర్మలబుద్ధి వచ్చె.
అంతట నెదురేఁగి యామగధేశుఁ
డెంతయు యొక్క తా నెలమితోఁ దెచ్చి
కనకాసనంబున ఘనతతో నునిచి
వినతుఁడై పదములు వేడుకఁగడిగి
యర్చించి రాజ్యంబు నఖలార్థములును
బేర్చి నందనుఁజూపఁ, బ్రియమున మౌని
యామగధేశుతో నప్పుడిట్లనియె:
"సామర్థ్యముగలట్టి జర దైత్యవనిత
నీకుపకారంబు నేర్పునఁజేసె;
నేక పోదృష్టి నిప్పుడుగంటి ;
నీకుమారుఁడు ధారుణీనాథచంద్ర,
యాకుమారునిశక్తి నలరినవాడు.
హరినిఁ గైకొనఁడు; కాలాంతకాంతకుని
హరుని మెప్పించు తా నరులమర్దించు;
వీనితోఁ [1]బోరిలో వీరాధివరులు
మానితోత్సాహులై మార్కొనుటన్న,

  1. బోరెడు (మూ)