పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

475


పదివేవు రుద్దండబలులు బాణముల
నదలించి యగ్ని నేయఁగఁ, జూచి నరుఁడు
తెంపున నచటికి దేరుఁదోలించి
యంపకోలల వాన నావీరవరులఁ
గప్పినఁ, దమచేతఁగాక వారరిగి
యప్పు డింద్రునితోడ నదిచెప్ప నలిగి :
"తొడుకైన నొకమాఱు తోలినఁబోవు;
గడుసన్న నొకపని గాదన్నమాను;
బలుపునాలుక మూలఁబడియు నిట్లేల
తొలఁగక యాచిచ్చు తోఁటకువచ్చు!
మఱియు బహ్వాశిత మనునమార్గునకు
నెఱిమండువానికి నీతి యెక్కడిది!
తక్షకుఁడక్కటా! తనయులుఁ దాను
నక్షీణగతినుండు నందుఁగాపురము;
ఏమయ్యెనో! వాని నేఁగాతు." ననుచు
వే మేఘములఁదెచ్చి వినువీథిఁబన్ని
ఘోరవర్షము వజ్రి గురియించి యుదక
ధారల నయ్యగ్ని తడియకుండినను,
ఘనపుష్కలావర్తికంబులచేత
బొనరఁ గుంభద్రోణములు గురియింప
నుఱియనిపందిలి యుగ్రబాణముల
నెఱచిచ్చుపైఁబన్ని యింద్రనందనుఁడు
వినువీథి మొగిళులు వివ్వనేయుటయు,
ననిమిషపతి యల్గి యాయగ్నిమీఁద
నెఱిపిడుగులవాన నిగిడింపఁ, బార్థుఁ
డుఱక యాశిఖి 'నోడకోడకు', మనుచుఁ
బెనుగాడ్పు తూపులఁ బిడుగులమొగులు
వినువీథివిప్పిన, వెండియు వజ్రి