పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

457


యాదవు లెఱిఁగిన నబలనీనీరు;
నాదు నేర్పునఁగూర్తు నాతి నీతనికి.”
అని నరుఁగాన నారాయణుండరిగి
మునులైననాఁటి యిమ్మునఁ గౌఁగిలించి,
మునుమున్న యతివేషముననున్నవానిఁ
గనుగొని మేలంబుగానరాఁ బలికె:
"చతురత ఫణులచే శబరులచేత
[1]నతివలఁ గొన్న సన్యాసులు మీరు;
ఎందుఁ బోయెదరు! నేనెఱుఁగుదుఁ గొంత
పొందు సేయుదు మీరు పూనినపనులు"
అనుచు రైవతకాద్రి కతనిఁదోడ్తెచ్చి :
'వినవయ్య! యాదవుల్ వెఱతురు యతికిఁ;
గావున, యతివైనక్రమము మేలయ్యె.
ఏవిధముననైననేమి! కార్యార్ధిఁ
దోతెత్తుఁ బ్రజల జాతరకు నిచ్చటికి;
నాతిఁ జూతువుగాక నయనంబులలర.”
అని శౌరి యాతని నచ్చోట నునిచి,
తనయూరి కేతెంచి తగుసంభ్రమమున
రైవతకాద్రియాత్రకుఁ జాటఁబనిచి
వేవేగఁ గదలుచో, వేడ్కతోఁ బ్రజలు
కుంకుమతో బండ్లుగొనితెచ్చువారుఁ,
గింకిణీరథములెక్కియు వచ్చువారు,
నారులఁగైసేసి నడపించువారు,
భేరులమ్రోఁతలు బెరయించువారు,
భక్ష్యభోజ్యంబులు పసిఁడిపాత్రములఁ
గక్ష్యలుకక్ష్యలుగాఁ దెచ్చువారుఁ,

.
  1. అతిదల (మూ)