పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

456

ద్విపద భారతము


నని యగ్నికల్పుఁ డిట్లానతిచ్చినను
అనఘాత్మ, మేమునిట్లైతిమిచ్చోట.
నెఱి నింతకాలంబు నీరాకగోరి
యొఱలుచునుండంగ నొదవె నీకరుణ.
భరతకులాంభోధిపరిపూర్ణచంద్ర,
యరిగి నాచెలియండ్ర ననుపవే! దివికి.”
అనుచు నాసురకాంత యలరిప్రార్థింప,
విని యర్జునుఁడు కృపావిమలుఁడై పోయి,
నాలుగుకొలఁకుల నలిఁ దీర్థమాడి
యోలి నాల్గురకును నొనరించెముక్తి
అప్పు డయ్యేవురు నమరకామినులు
నుప్పొంగి యా క్రీడి నొసరదీవించి
యలకాపురంబున కరిగిరి వేడ్క
జలజాక్షుమఱఁదియు జలచరంబులకుఁ
బస మోక్షమార్గంబు ప్రాపింపఁ జేసి,
మసలక యంతలో మహిమదీపింపఁ
గదలి పశ్చిమవార్ధిఁ గరళులుమిగులఁ
గదిసినపురము గోకర్ణంబుచేరి,
యచ్చోటియతులకు అభివందనములు
చెచ్చెరఁ గావించి, శివుని సేవించి,
భాసురంబైన ప్రభాసతీర్థమున
వాసుదేవుని లోకవంద్యునిఁ గొలిచి,

అర్జునుఁడు ద్వారక కేఁగుట


ద్వారకాపురికేఁగుతలఁపుననుండ,
శౌరి యాతనిభావసరణి మున్నెఱిగి:
"యితఁడు సుభద్రపై నిష్టంబుగలిగి
గతివశంబున వచ్చెఁ గాదననేల!