పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

432

ద్విపద భారతము



మఱియుఁ గల్గిరి చాలు మహిఁ బాండుసుతులు;
ఉఱక మ్రోయుచునుండె నుర్విదుర్వార్త ;
బోరన రప్పించి భూమి పాలిచ్చి,
వారికి హితుఁడనై వర్తించువాఁడ. "
అనవిని తండ్రికిట్లనియె రారాజు

దుర్యోధనుఁడు తండ్రితో దుర్మంత్రణము సేయుట



“మనము వారలకింక మంచివారలమె!
ఇంక సామోపాయ మేటికి వినుము;
కొంకక భేదంబు గొనియాడవలయు ;
'నేగురకొకయింతి యిదిహేయ' మనుచు
బాగొప్పఁ బాంచాలుపట్టు వదల్చి,
ద్రుపదుని వారిసందున ముడివన్ని,
నిపుణత వారి నన్నెలవువావుదము;
కాదేని, నేర్చిన కాంతలఁ బంచి
యా దేవి నిన్నొల్ల డతనికివలచు
నిను దప్పనాడె నీనృపతిఁగీర్తించె..
నని పాండవులలోన నలుకపుట్టించి,
పోరాడి తమలోనఁ బొలియఁజేయుదము;
నారులెంతకు లేరు నరులబోధింప!"
అనినఁ, గర్ణుఁడువల్కు : "నది నీతిగాదు;
కినియరు వారెంతకీలువన్నినను;
అనుపమ నేనాసహాయుల మగుచు
మనమెత్తిపోద మీమార్తుఱమీద.
బలములపసలేని పాంచాలుఁడెంత!
తలఁప రాజ్యము లేని ధర్మరాజెంత !
వినిపించె వారియొద్దను 'వీపుఁదోమ
మనుజుండులేఁ' డని మనవేగువాఁడు.