పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

ద్విపద భారతము


అలయదునీటిలో నమ్మేటి మొసలి;
యలఁత మాకడరెడునటమున్న నీవు
విడిపింపు". మనుటయు వివ్వచ్చుడడరి,
కడునుగ్రచాపంబు గడఁక మ్రోయించి
పటుతీవ్రసాయకపంచకంబునను
దటుకున మకరంబుదవడలు చించి,
విడువనిమకరంబువెసఁజించి, యిభము
విడిపించినట్టి శ్రీవిష్ణువోయనఁగ
విడిపింప, రాహుచే విడివడ్డచంద్రు
వడువున విడివడివచ్చి ద్రోణుండు
'పాంచాలపతి పట్టుపడు వీని ' కనుచు
నంచితసంతోషుఁడైయుండెననుచు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించె" నని చెప్ప, వెండియు వారు
“అనఘాత్మ, తరువాత నై నవృత్తాంత
మనువొందఁజెప్పవే !" యని వేడు టయును,
బంచమవేద ప్రబంధైకనాథ,
పంచాక్షరీమంత్ర పావనమూర్తి
శాస్త్ర పురాణార్థ సార వివేక,
శస్త్ర ఖండిత శత్రు సైన్య ప్రపంచ,
సతతచాపాలంబ, సత్కీర్తిబింబ,
మతి ధైర్య నిర్జితామరమంత్రివర్య,
నుతధర్మ, నీకు మనోరథావాప్తి.
ఇదిసదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యశ్వాస మొప్పె నాల్గవది.

+++++++++++++++