పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

151


అతనికి నీ వెట్టులాత్మజవైతి!
హితమతి నీక్రమం బెఱిఁగింపవలయు.”
అనిన, శకుంతల యారాజుకనియె:

శకుంతలాజన్మవృత్తాంతము



"విను, మేను విన్నట్టివిధము చెప్పెదను;
అనఘ, విశ్వామిత్రుఁడను రాజమౌని
మును దపంబుండంగఁ బురుహూతుఁడలిగి,
తనరాజ్య మాతండు తడవునన్ భీతి
మనముగా నంకిలిగావింపఁ దంచి,
మేనకయనుదాని మృగరాజమధ్య
మానుగా రావించి మన్నించి పలికె :
'ఓకాంత, వీ వేఁగి యుగ్రతపంబు
చేకొనిసేయు కౌశికమునీంద్రునకు
వివిధభావంబుల విఘ్నంబుచేసి
యువతి, యేతే;'మ్మన్న నువిద యిట్లనియె:
'ఓదేవ, నీమాట యొనఁ[1]గూర్పనోపఁ;
గాదు నాచే నింతకార్యంబుసేయఁ;
దగ దూడలోపునే దంటు మేయంగ!
మగువలతరమె యమ్మహితాత్ముగలఁప!
నెఱిఁగియుఁ బాఁతఱ నెవ్వఁడుగూలు!
వెఱతు నేఁ బోవ నావిమలాత్ముకడకు.'
అనిన నింద్రుఁడుపల్కె: 'నట్లేల! నీకు
ననువగునీకార్య; మతివ, భీతిలకు;
గాని కార్యములకుఁ గళ్యాణి, నిన్ను
బూనుదునే! వేడ్కఁబొ;' మ్మన్న నదియుఁ
గైకొని యేతెంచి, కౌశికునెదుటఁ
దూకొన్న మధులక్ష్మితోడుగా మెఱసి,

  1. గూడ (మూ)