పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

79


యతులకు నుపహతియగునని, శాఖ
క్షితిమీఁదఁ బడకుండఁ జెలువొంద దానిఁ
గఱచిపట్టుక, గజకచ్ఛపంబులను
నిఱికిపట్టుక దివినేఁగుచో, నెచట
నిలువనాధారంబు నెఱిఁ గానలేక
పలుశాఖతోడుతఁ బలువిడి తండ్రి-
కడకేఁగి మ్రొక్కినఁ, గశ్యపబ్రహ్మ
కొడుకులావునకు నెక్కుడు ముదంబంది,
యమ్మహాశాఖయం దతినిష్ఠనున్న
యమ్మునీశ్వరులఁ బ్రియంబునఁజూచి:
యలఘుబలోదాత్తుఁడగు నీసుపర్ణుఁ
డలమి యీశాఖ మీకగుబాధకులికి
విడువకయున్నాఁడు, వీని మన్నించి
కడఁకమై మీరొండుకడ కేఁగవలయు."
ననుచుఁ బ్రార్థించిన యతని వాక్యములు
విని, యతుల్ తరుశాఖవిడిచి శీతాద్రి
కరిగిన, గరుడఁ డత్తఱిఁ దరుశాఖ
ధరణిపై విడువక తండ్రి కిట్లనియె:
ఈశాఖ విడిచిన నిందుచే జనులు
నాశముగానికాననమానతిమ్ము'
అనవుడు విని : “తుహినాద్రిప్రాంతమున
ఘనత నిష్పురుషనగంబున వైవు;
చను మదిలక్షయోజనములదూర'
మనిన గరుత్మంతుఁ డతులవేగమునఁ
జని, తరుశాఖ యచ్చట దిగవిడిచి,
ఘనుఁడు శీతాద్రిపై గజకచ్ఛపములఁ
దనివోవభక్షించి తగఁదృప్తిఁబొంది,
యనఘుండు మఱి తుహినావనీధరము