పుట:దశకుమారచరిత్రము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

57

     ననియెఁ దద్వచనమునకు ననుగుణముగ
     నీవుఁ జనుదెంచి తిచటికి నెమ్మి వెలయ.23
మ. అనినం బ్రీతమనస్కు డై నృపతి సాహాయ్యంబు గావింతు నే
     నని నిక్కంబుగఁ బల్కి యచ్చెలులఁ బాయం బెట్టి యారాత్రి తా
     నును మాతంగకుఁడు వనాంతమునకున్ మోదంబు సంధిల్లఁ బో
      యినఁ బ్రాభాతికవేళ నందఱును ధాత్రీశాగ్రణిం గానమిన్.24
వ. విషణ్ణు లగుచుం గూడఁ బాఱి తత్ప్రదేశంబున నారసి విత
     ర్కించి వివిధదేశంబుల వేర్వేఱ వెదకువారై తమకు
     నందఱికిం బదంపడి గూడికొన నొక్కసంకేతస్థానంబుఁ జెప్పి
     కొని బహుముఖంబుల నరిగి రంత నిక్కడ రాజవాహన
     కుమారుండును మాతంగకుండును నీశ్వరోపదిష్టప్రకారం
     బునఁ బరాజ్ఞాతం బైన బిలంబు సాధించి చొచ్చి శాసనంబులు
     పరిగ్రహించిరి తదనంతరంబ.25
సీ. పాతాళమునకు నిర్భయమునఁ జని యొక్క
                    పురముచేరువ సరోవరముక్రేవ
     శాసనక్రమమున సంభావితములైన
                    చారువస్తువులు ప్రసన్నబుద్ధి
     వివిధవిఘ్నములకు వెఱవక యగ్నికుం
                    డంబున సిద్ధిహోమంబు సేసి
     రక్షాకరుండగు రాజవాహనపతి
                    సూచి నెమ్మనమునఁ జోద్యమంద
తే. మంత్రపూర్వంబుగాఁ గ్రాలు మంటలోన
     నుఱికి మాతంగకుండు విద్యుత్సమాన