పుట:దశకుమారచరిత్రము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

దశకుమారచరిత్రము

     క్ష్మేక్షణగోచరుం డయిన యీశ్వరుచందముఁ దెల్పి సత్క్రియా
     దక్షత నాకు నూల్కొలిపి తా నరిగెన్ ముదితాంతరంగుఁ డై.20
ఉ. ఏనును నాదుబాంధవుల నెవ్వరి మెచ్చక పాసివచ్చి యీ
     కాననభూమిలోనఁ ద్రిజగద్గురుఁ జంద్రకళావతంసుఁ జే
     తోనళినంబునం దిడి విధూతకళంకుఁడ నై వసించెదన్
     మానవనాథ! యిట్టి క్రమం బని యేర్పడఁ జెప్పి వెండియున్.21
క. పతిఁ [1]బాయఁ బిలిచి యతఁ డే
     కతమున నిట్లనియె నేడు కలలో గౌరీ
     పతి నాకు సన్నిహితుఁ డై
     హితుఁడగు బాంధవుఁడువోలె నిట్లని పలికెన్.22
సీ. దండకారణ్యమధ్యంబునం బాఱిన
                    సెలయేటిదరిఁ బ్రతిష్ఠించియున్న
     పటికంపులింగంపుఁ బడమటిదెస సమం
                    చితగిరిజాపదచిహ్నమైన
     శిల క్రేవఁ గల దొక్కబిల మందులో రెండు
                    సాధనతామ్రశాసనము లుండుఁ
     జని చొచ్చి యిష్టశాసనవిధి సాధించి
                    పాతాళలోకాధిపతివి గమ్ము
తే. నీకుఁ దోడ్పడువాఁ డొక్కనృపకుమారు
     డెల్లి నేఁ డిందులకుఁ దాన యేఁగుదెంచు

  1. జేరఁ