42
దశకుమారచరిత్రము
కుమారుం డొక్కబాలకునిం గొనివచ్చి రాజునకుఁ జూపి
యిట్లనియె.84
ఆ. ఏను రామతీర్థ మేఁగి క్రమ్మఱి వచ్చి
వచ్చి యొకమహెూగ్రవనమునందు
నొక్కవనితచేత నుండంగ నుజ్జ్వలా
కారుడగు కుమారుఁ గని నయమున.85
క. డాయం జని నీ వెవ్వతె
వీయర్భకు నెత్తికొని యహీనాటవిలో
నాయాసంబునఁ దిరుగుట
కేయది గత మనిన నదియు నిట్లని పలికెన్.86
ఆ. కాలయవన మనఁగఁ గల దొకదీవి యం
దనఘ! కాలగుప్తుఁ డనఁ బ్రసిద్ధ
వైశ్యవరుఁడు గలఁడు వానికి గాదిలి
తనయయగు సుపుత్రదాది నేను.87
సీ. తద్ద్వీపమునకు నేతద్వీపముననుండి
మగధాధినాథుని మంత్రికొడుకు
రమణీయగుణనిధి రత్నోద్భవుం డను
వాఁడు బేహారంబువచ్చె నతని
కులశీలవిద్యలఁ గలపెంపునకు నియ్య
కొని తనకూఁతు నతనికి బ్రీతిఁ
బరిణయ మొనరించి పరమసమ్మదముతో
నతఁ డాత్మసంపద కధిపుఁ జేసె
తే. నాలతాంగియు గర్భిణి యయ్యె నంత
సోదరులఁ జూచు వేడ్క రత్నోద్భవుండు