పుట:దశకుమారచరిత్రము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41

     త్కేళీసందర్శనసుఖ
     లాలసుఁ డై యుండె నిశ్చలప్రేమమునన్.78
చ. జనపతి యొక్క పుణ్యదివసంబునఁ బావనతీర్థసేవనం
     బున కని యేఁగుచో విపినభూమిఁ గిరాతులపల్లెపొంతఁ దా
     ననుపమమూర్తిమంతు నొకయర్భకు నొక్కతె ముద్దు
     లాడఁగాఁ గనుఁగొని యంతరంగమునఁ గౌతుక మెంతయు
     నగ్గలింపఁగన్.79
క. మీబోఁటులచందము గాఁ
     డీబాలుఁడు రుచిరమూర్తి యెవ్వరి తనయుం
     డే బాసఁ జేరె ననవుడు
     నాబోయతమగఁడు వినతుఁడై యి ట్లనియెన్.80
తే. ఆత్మదేశంబుదెసకుఁ బ్రహారవర్మ
     విపినపదమున నడవంగ వేచి తాఁకి
     చూఱుగొనుచుండి వీని నచ్చోట నోర్తు
     చేతఁ గొనితెచ్చి వేడ్కఁ బెంచెద నరేంద్ర!81
వ. అనుటయు.82
క. ముని చెప్పిన రెండవనృప
     తనయునిగా నెఱిఁగి సావధానమునఁ గిరా
     తునిఁ బ్రీతుఁ జేసి బాలకు
     గొనివచ్చె మహీశ్వరుండు కూరిమి వెలయన్.83
వ. ఇట్లు తెచ్చి యుపహారవర్మ యని పేరుఁ బెట్టి వసుమతీ
     దేవికి సమర్పించి యుపలాలించుచుండెఁ బదంపడి యొక్క
     నాఁడు వామదేవుని శిష్యుండు సోమశర్ముఁ డను ముని