ద్వితీయాశ్వాసము
31
యేవపుమాట లేమిటికి నెల్లవిధమ్ముల మానసారుపైఁ
బోవుటమాన వాఁ డనికిఁ బూని నిజంబుగ నెత్తివచ్చినన్.32
వ. అనినం బతిపలుకు లతిక్రమింపనేరక యొడంబడి వీడ్కొని
నిజనివాసంబులకుఁ జనిరి మఱునాడు మాళవేశ్వరుండు
సమస్తసామగ్రితో నెత్తివచ్చిన విని సుమతి ప్రముఖులగు
నలుగురు మంత్రులు కార్యబలంబు సాధనంబుగా నధిపు
చిత్తంబు మెత్తం జేసి హేతుదృష్టాంతంబులు సూపి యొడఁ
బఱచి గర్భభారాలసాంగియైన మహాదేవి నిఖిలాంతఃపుర
సంతానంబుఁ గూర్చి బుద్ధిసహాయంబుగా నాత్మసతీవర్గం
బును శరీరస్థితిసహాయంబుగా ధాత్రీవర్గంబును గ్రీడాస
హాయంబుగా సఖీవర్గంబును దుర్గస్థలవర్తనసహాయంబుగా
మూలంబును సమర్పించి వింధ్యాటవీమధ్యంబున నిగూఢం
బుగా నిలువ నియమించి కందువఁ జెప్పి యనిచిపుచ్చిరి
రాజహంసుండును దండు వెడలె నిట్లొండొరులు చేరవిడిసి.33
క. మగధాధీశుఁడు మాళవ
జగతీపతియును సమస్తసైన్యాన్వితు లై
దిగధీశులు మది బెదరఁగ
నగునగు ననఁ బోటులాడి రాహవభూమిన్.34
క. తదవసరంబున విజయా
స్పదుఁడై మగధేశుమీఁద భవదత్తమహా
గద వైచె మాళవేశ్వరుఁ
డది నుగ్గుగ నేసె రాజహంసుం డలుకన్.35
ఉ. భూతపతిప్రసాదవిధి బొంకగు టెందును లేమిఁ దీవ్రమై
యాతునుకల్ రణాగ్రమున నన్నియు నన్ని ముఖంబులన్ వడిన్