పుట:దశకుమారచరిత్రము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

దశకుమారచరిత్రము

     సూతునెఱంకు లంటి నృపసూనుశరీరము గాఁడెఁ గ్రక్కునన్
     సూతుఁడు నేలఁ గూలెఁ బతి సొమ్మిలఁ బోయె రథోపరిస్థలిన్.36
క. అంత వడిం దురగము లు
     ద్భ్రాంతము లై కలను వెడలి పటుగతిమైఁ ద
     త్కాంతాజును లున్నయర
     ణ్యాంతరమున కేఁగె దైవయత్నముకలిమిన్.37
వ. ఇట్లు రథ్యంబులు పఱచునెడ నంతఃపురసన్నివేశంబున
     కనతిదూరంబున నొక్కవటవిటపి నరదంబు దగిలినఁ బరి
     శ్రాంతములైన వాహనంబులు నిశ్చలంబు లై యుండ రాజ
     హంసుండును సేదదేరకయుండె నట మాళవేశ్వరుండును
     మగధపతిరాజ్యంబు గైకొని కుసుమపురంబున కరిగిన.38
క. నలుగురు (మంత్రులు) నిట పొలి
     కలనం బడియును విధాతృకారుణ్యమునం
     దెలిసి పతిఁ దడవి కానక
     పొలఁతులకందువకుఁ జేరఁబోయిరి పెలుచన్.39
వ. ఇట్లు చను దెంచి వారలు వసుమతీమహాదేవిం గని యుద్ధ
     ప్రకారంబును రాజహంసునిం గలని రోసి కానమియు సవి
     షాదంబుగా నెఱింగించిన నిజవల్లభుండు పరలోకగతుం
     డయ్యన కాఁదలంచి యద్దేవి శోకంబు సైరింపంజాలక తను
     త్యాగంబునకు నుద్యోగించి యనలంబు దయసేయుం డనిన
     మంత్రు లిట్లనిరి సంశయంబగు పతిమరణంబునకు నను
     మరణంబు తగ దదియునుంగాక నీస్వప్నఫలంబు సాకారం