30
దశకుమారచరిత్రము
పోవుటయు నేనుఁ బోయితి
నీవేషము దాల్చి మాళవేశ్వరుపురికిన్.25
వ. అందు నిగూఢంబుగా వర్తించి యతనివర్తనంబు నెఱింగి
వచ్చితి నది యెట్లనిన.26
క. ఆనృపతి మును పరాజితుఁ
డై నీచే నిలువఁబడిన యంతటఁగోలెన్
బూని మహాకాళంబునఁ
దా నీశు గుఱించి యుగ్రతప మొనరించెన్.27
చ. అతనితపఃప్రభావమున కాపరమేశుఁడు మెచ్చియిచ్చె ను
ద్యతగద యేకవారభయదంబుగఁ గావున దానిలావునన్
బ్రతిభటుఁడై కృతఘ్నమతిఁ బైఁ జనుదేరఁగ నున్నవాఁడు ని
శ్చిత మిది మీఁదికార్య మెడసేయక సేయుము మేదినీశ్వరా!28
చ. అని యెఱిఁగించి వాఁ డరుగ నప్పుడె కార్యము నిశ్చయించి యి
ట్లనిరి తగంగ మంత్రులు నరాధిప! యిట్టిదయేని మాళవేం
ద్రున కెదురెత్తరా దతఁడు రోషమునం బయి నెత్తివచ్చినన్
జెనయుట దక్కి దుర్గములు సేరుట నీతి దలంచిచూడఁగన్.29
వ. అని దైవబలము విచారించి పలికిన మంత్రులను బతి యి
ట్లనియె.30
మ.మగపంతంబున మానసారుఁ డనిలో మా కల్గి పై నెత్తినన్
బగ వాటింపక వాని నొంపక జగత్ప్రఖ్యాతిగా నోటమైఁ
దగ వూహింపక దుర్గభూములకు నిందాపాత్రమైఁ బోక బు
ద్ధిగఁ జెప్పందగునే నృపప్రకృతి నిస్తేజంబు సైరించునే.31
ఉ. దైవబలం బసాధ్య మని ధైర్యము పెద్దఱికంబు లజ్జయుం
బోవఁగఁ బెట్టి కానలకుఁ బోయిన లోకమువారు నవ్వరే