ద్వితీయాశ్వాసము
29
త్సవం బొనర్చి మగధేశ్వరుండు విభవవిజితదేవేంద్రుం
డగుచు మంత్రిపురోహితసామంతపరివారపరివృతుం డై
కొలువున్న యవసరంబునఁ బ్రతిహారి చనుదెంచి సవిన
యంబుగా నిట్లనియె.19
క. దేవ! భవద్దర్శనసం
భావన లెడఁ గోరి వచ్చి ప్రతిహారమునన్
దేవసముఁ డొకమునీంద్రుఁడు
దా వేడుక నున్నవాఁడు ధరణీనాథా!20
క. అని విన్నవించి జనపతి
యనుమతమునఁ దోడి తెచ్చె నాసన్న్యాసిన్
గని యెఱిఁగి మందహాసము
వినయముతోఁ గూర్చెఁ బతి వివేకము వెలయన్.21
ఉ. అంతఁ బయోజబంధుఁడు దినార్ధగతుండగుడున్ సమస్తసా
మంతుల భృత్యులన్ బుధుల మాన్యులఁ బొండని యానృపాలుఁ డే
కాంతగృహంబులోనికిఁ బ్రియంబున మంత్రులుఁ దాను బోయి వే
షాంతరగూఢుఁడైన చరు నల్లన చేరఁగఁ బిల్చి యిట్లనున్.22
క. ఓరీ! నీతో వచ్చిన
చారులు నినుఁ బాసి యెందుఁ జని రీ వీయా
కారముఁ గొని యేపురముల
నేరాజుల కొలఁదు లెఱిఁగి తెఱిఁగింపు మొగిన్.23
వ. అనిన వాడు సవినయంబుగా నిట్లనియె.24
క. దేవరపనుపున మును నా
నావిధదేశముల కెల్ల నాతోడిచరుల్