పుట:దశకుమారచరిత్రము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

దశకుమారచరిత్రము

     భీలత్రివిధబలంబులు
     నాలంబున రౌద్రరసము నాకృతి చూపెన్.14
వ. తత్సమయంబున.15
ఉ. ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁ బోరి రాజిలోఁ
     గాముఁడు శంబరుండు శశిఖండధరుండు గజాసురేంద్రుడున్
     రాముఁడు రావణుండు సురరాజతనూజుఁడు సింధునాథుఁడున్
     భీముఁడు దుస్ససేనుఁడు నుపేంద్రుడు కంసుఁడుఁ బోరునాకృతిన్.16
వ. ఇ ట్లతిఘోరయుద్ధంబు సేసి పసమరియున్న మానసారుం
     జూచి కరిపోతకంబుఁ గనిన కంఠీరవంబునుంబోలెఁ గోపించి
     పట్టుకొని తదీయసదనంబు లజ్జావనతం బగుట గనుంగొని
     కరుణించి యమ్మాళవేంద్రునిం దోడ్కొనిపోయి వానిరా
     జ్యంబునం బ్రతిష్ఠించి క్రమ్మఱివచ్చి రాజహంసధాత్రీపతి
     యప్రతిహతం బగు తనసంపద పొంపిరివోవ లక్ష్మికిం
     బాత్రంబుగా సుపుత్రుం బడయం గోరుచున్నయెడ నొక్క
     నాఁడు ప్రభాతసమయంబున.17
క. వసుధాధిపుకోర్కికిఁ దగఁ
     బసనగు సంతానవృక్షఫలము కరుణతో
     వసుమతికి వాసుదేవుం
     డొసఁగెన్ గలలోన దైవయోగము పేర్మిన్.18
వ. ఆసుస్వప్నంబు సఫలంబగుటం చేసి యద్దేవి గర్భంబు దాల్చి
     నం బ్రమోదసంపదవలనఁ బొంపిరివోవుచు సమస్తసు
     హృద్భూపాలవర్గంబు రావించి వసుమతీదేవికి సీమంతో