ద్వాదశాశ్వాసము
329
క. విద్యేశ్వరుండు వచ్చిన
నుద్యత్ప్రీతిన్ విభూతి యొసఁగి యతనికి
హృద్యమగు నింద్రజాలకు
విద్యాసంబంధవచనవిరచిత మొసఁగెన్.76
వ. ఇట్లు పూర్వకృతోపకారుం డైన యతని నభిమతార్తంబులం
గృతార్థుం జేసి సోమదత్తపుష్పోద్భవులం గనుంగొని.77
ఆ. మాళవేంద్రుఁ జూపి మాన్యత నితనికి
నెల్లభోగములును జెల్లఁజేయుఁ
డనుచుఁ బ్రియముతోడ నధిపతి వారికి
నప్పగించెఁ బేర్మి యతిశయిల్ల.78
వ. మఱియునుం జెలులకుం గారణమిత్రు లగువారల నందలి
జనంబులను నర్హపదవీప్రదానంబులం బ్రీతచిత్తులం గావించి.79
క. పెనుపొంద సోమదత్తుం
గనుఁగొని మీవీటి కరిగి క్రమ్మఱ నిట చ
య్యనఁ జనుదెమ్మని సముచిత
జనంబుతోఁ బనిచి పుచ్చి సమ్మదలీలన్.80
తే. అప్పురంబునఁ చానుఁ బ్రియాంగనయును
వివిధకేలిఁ గ్రీడింపుచు విభుఁడు నిలిచెఁ
గొన్నిదినములు సైన్యంబు గూర్చుకొని ర
యంబుమై సోమదత్తుండు నరుగుదెంచె.81
వ. ఇవ్విధంబున సంపూర్ణమనోరథుం డైన రాజవాహనుండు
విభవం బెసంగ నవంతిసుందరీసమేతుం డై సకలసేనా
పతులుం గొలిచి రాఁ గతిపయ ప్రయాణంబుల వామదేవు
నాశ్రమంబునకుం జని దాని కనతిదూరంబున నదీతీరంబున