పుట:దశకుమారచరిత్రము.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వాదశాశ్వాసము

319

     డునుం గాపాలికవేషంబున నాపురంబున నిలిచి భిక్షాన్న
     రక్షితశరీరుల మగుచు దుర్గమవిపినంబున నొక్కబిలంబు
     దుర్గపీఠంబుచక్కటికి వెడలం ద్రవ్వి జనదృష్టికి ననుపలక్ష్యం
     బుగా నాయితంబు సేసి యద్ధనంబు ముందటి యర్ధరాత్రం
     బున నీవు దెచ్చియిచ్చిన యుజ్జ్వలాభరణపట్టవసనమాల్యాం
     గరాగంబుల నలంకృతుల మై బిలప్రవేశంబు చేసియుండి
     పంచమహాశబ్దంబుల నాసమయం బెఱింగి దేవిప్రతిమ
     యెత్తుకొని యుద్గమించి దానం గ్రమ్మఱ నెప్పటియట్ల కాఁ
     బెట్టి కవాటోద్ఘాటనంబు చేసి చనుదెంచిన రాజ్యసిద్ధి యగు
     మద్వచనంబు సాంగత్యంబుగా ననుష్ఠింపు మని పనిచిన. 26
ఆ. వాఁడు నరిగి యంతవట్టు గావించిన
     నేము నట్ల సేసి యెల్లజనులు
     నట్టు లెత్తి చూడ నాగండి వెడలి య
     శంకితాత్ము లగుచుఁ జనినయపుడు.27
మ. కర మాశ్చర్యముఁ బొంది మంత్రిజనముల్ కారుణ్యపాత్రత్వముం
     బొరయం గోరుచుఁ జాఁగి మ్రొక్కి ముదితాంభోరాశిభంగిన్ దిశా
     పరిపూర్ణం బయి పారలోకజయశబ్దశ్రేణి ఘూర్ణిల్లె నా
     దరలీలం దగుసేన రాఁ బనిచె నంతన్ దేవు లచ్చోటికిన్.28
ఉ. పట్టము గట్టి మంత్రులును భాస్కరవర్ముని వారణేంద్రుపై
     బెట్టిరి వారువంబుఁ గడుఁ బెం పెసలారఁగ నెక్కి వారు నా
     చుట్టును వచ్చుచుండ నృపసూనుని ముందటఁ గొల్చిపోయి య
     ప్పట్టణ మంతఁ జొచ్చి తగుభంగిఁ బ్రభుత్వము నిర్వహించితిన్.29