దశకుమారచరిత్రము
318
వ. మహాదేవి యి ట్లనవలయు.24
సీ. వింధ్యవాసిని గల వేంచేసి నీపుత్త్రు
నేను సింహాకృతి నెక్కడేని
గొనిపోయి దాఁచితి వినుము మద్గణముల
తోనన మన్నింతు వానిబుద్ధి
బలపరాక్రమములుఁ గలిగెడు నిర్మల
ద్విజకుమారుని రూపవినయవంతుఁ
గాపు పెట్టినదానఁ గ్రమ్మఱఁ బుత్తెంతు
మాహిష్మతీరాజ్యమహిమ యిచ్చి
తే. వాడు మంత్రి యై భాస్కవవర్మపదవి
నడుపునట్లుగఁ బనిచెద నాకు నీవు
వియ్యమవు మంజువాదిని యయ్యమాత్యు
భార్యగా నొనరించితి బ్రదుకుఁ డనియె.25
వ. ఎల్లుండి మనముం దనకు విశేషపూజ గావించి పంచమహా
శబ్దంబులతోడ గుడిలోపల నత్యంతవిజయంబు సేసి తిగిచికొని
వెడలి యెడ గలసియుండ నందుండి యయ్యిరువురు నిర్గ
మించి మనకుఁ బొడసూపంగలవా రనియు నానతి యిచ్చెఁ
గలఁగన్న యాత్మకుం గంప లెత్తికొని పోయినయ ట్లంతన
సంతోషింపలేదు కన్నప్పుడు దాన లోకప్రసిద్ధం బయ్యెడు
నంతవునంతకు నీమాట గుప్తంబు గావలయు నని చెప్పి
వీడుకొలుపునది. వారునుం దమలోన నవ్వనిత పతివ్రత
గావున దైవసాధ్యంబు గలుగనోపు నట్టి యాశ్చర్యంబు
గంటిమేని యింతకంటెను మనకు వెరవు వే ఱొకండు లేదు
లెస్స పొమ్మని యుండుదు రటమున్న యేనునుం గుమారుం