పుట:దశకుమారచరిత్రము.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

దశకుమారచరిత్రము

వ. అంత వసంతభానుండు మిత్రవర్ముమరణంబు విని ధరణి గై
     కొన దాడిమై నల్పసైన్యంబుతో నడచె మాహిష్మతీరాజ్యం
     బరాజకం బగుట నందలివా రెల్లను నంతకుమున్న తమ
     తమయంతం జతురంగబలంబులం గూర్చుకొని యునికిం జేసి
     యేనును సేనాసమగ్రుండ నై గ్రక్కునం దండువెడలి
     వారిచేతం బగతు కొంచెపుఁదనంబు వినుట నుద్దవిడిం గదియ
     నడచినం బదంపడి యతండు భాస్కరవర్మ యద్భుతరాజ్య
     ప్రాప్తి ప్రపంచం బంతయును విని వెనుకకు జరుగ ననువు
     గాక సాహసంబున మోహరించి.30
శా. సైన్యంబుల్ మద మెక్కి బాహుబలముల్ శౌర్యంబులుం జూపి ని
     ర్ధైన్యస్ఫూర్తి గడంగిపోరఁ బటుశస్త్రప్రౌఢిమై నిష్ఠురా
     న్యోన్యా(స్తా)హవనోత్థితాగ్నికణరౌద్రాకారతన్ లోకసా
     మాన్యాతీతమహోగ్రవిక్రమరణోన్మాదప్రకారంబు లై.31
వ. అట్టియెడ.32
క. పసమరక ప్రజలు ముందట
     వెసఁ దునుమఁగ నల్లనల్ల వెనుకకు జరగన్
     గసిమసఁగఁ జేయి వీచుచు
     వసంతభానుండు దాఁకె వసుధ వడంకన్.33
ఉ. తాఁకినఁ దద్బలంబులు నుదగ్రపరాక్రమదుర్దమంబు లై
     వీఁక నెదుర్ప జూచి పిఱువీఁక మదీయవరూధినుల్ జముం.
     డాఁకలి పుట్టి బిట్టడరునట్లు ప్రజం బురికొల్పికొంచు నే
     నాఁకకు మీఱు వారిధిక్రియన్ రిపుసేనల నాక్రమించితిన్.34
వ. ఇట్లు బరవసంబు సేసిన.35