పుట:దశకుమారచరిత్రము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

25

     జంపానగరంబునం గుమారు లెల్లం గూడుటయుఁ దొలుతఁ
     గూడిన యిరువురచరితంబులు రాజవాహనువలన నెఱింగి
     దక్కినకుమారులుం దమతమచరితంబులు క్రమంబున నత
     నికి విన్నవించుటయును బదంపడి శాత్రవజయం బొనర్చి
     రాజహంసుచేత రాజవాహనుం డభిషిక్తుం డగుటయు
     నతండు సముద్రముద్రితంబైన వసుధాచక్రంబు నిర్వక్రం
     బుగాఁ బాలించి మిత్రగణసమేతంబుగా రాజ్యసుఖంబు
     లనుభవించుటయు నై యొప్పు సిద్ది యది సవిస్తరసందర్భ
     సంకీర్తనం బాకర్ణనీయంబుగా వర్ణించెద.2
సీ. ఎందులపరిఖ భోగీంద్రబృందమునకు
                    భాసురకేళీనివాస మయ్యె
     నెందులకోట దినేంద్రునశ్వములకు
                    సముచితవిశ్రమస్థాన మయ్యె
     నెందులసౌధంబు లిందిరాదేవికి
                    నెసకంపుఁ బుట్టినయిండు లయ్యె
     నెందుల జనుల సమృద్ధవర్తనములు
                    పరుల కుత్తమకృత్యభంగు లయ్యె
ఆ. నట్టి కుసుమపురమునందు విశ్వంభరా
     భారభరణపరిణతోరుభుజుఁడు
     రాజవంశజుండు రాజహంసుం డను
     రాజు గలఁడు దివిజరాజనిభుఁడు.3
వ. అమ్మహీవల్లభునకుం గులక్రమాగతులగు నాప్తమంత్రులు
     మువ్వురు గల రందు మతిశర్మ యను మంత్రికి సుమ
     తియు సత్యశర్మయు, ధర్మపాలుండను నమాత్యునకు సుమి