ఏకాదశాశ్వాసము
311
యనంతవర్మయగ్రమహిషి యైన మహాదేవినిం దత్పుత్రి
మంజువాదినిం బుత్రకు భాస్కరవర్మనుం దోడ్కొని వెడలి
పరదేశంబున కరిగి వారలకు నాపదను బంధువిధాయకుం
డైన విధాతకరుణాహీనత నయ్యమాత్యుండు కాలగోచరుం
డగుటయు నత్యంతవిరళంబై పరిజనంబు వారిం దడవి తెచ్చి
మాహిష్మతిఁ జేర్చి యప్పట్టణం బేలెడు మిత్రవర్మ యనంత
వర్మ పెద్దకొడుకు గావున.131
క. ఆనరపతిఁ గనిన నతం
డనూనప్రియపూర్వకముగ నుర్వీశుసతిన్
సూనునిఁ గుమారిఁ బురి నొక
చో నుపయోగ్యప్రభావసుస్థితి నునిచెన్.132
వ. ఇట్లు కొన్ని దినంబులకు.133
తే. మఱఁదలికి నాసపడి లోలమతిఁ జరించి
యమ్మహాదేవి పతిభక్త యగుటఁజేసి
తనకు లోను గాకున్న నతండు చాల
సిగ్గుపడి పోయి కలుషితచిత్తుఁ డగుచు.134
క. ఈయసతి సుతుని నృపుఁ గాఁ
జేయఁగ నని యున్నఁ గలుచఁ జేరద మృతునిం
జేయంగవలయు నేమి యు
పాయంబు లొనర్చి యైన బాలకు ననుచున్.135
తే. క్రూరబుద్ధి యై తొడగినఁ గొంతకొంత
వినియు వినమి నంతఃపుర[1]వృద్ధు కొకని
- ↑ వృద్ధు నొకని