310
దశకుమారచరిత్రము
వ. మఱియు ననేకప్రకారంబుల ననంతవర్మ మిత్రుల నెల్లను
వేఱుపఱచి వివిధవస్తుప్రదానంబులం దనవశంబు గావించి
వసంతభానుండు వానికి ననంతదేవునకుం దనతోడి పొందు
శపథకీలితంబుగా దృఢంబు చేసికొని.127
ఆ. భానువర్మ తోడు గా నరపాలుర
నెల్లఁ గూర్చి వారి నింద నిలిపి
యవ్విదర్భపతికి నాపద పుట్టించు
నట్లు కుటిలనీతి యనువు చేసె.128
ఆ. మొనలు నడుచునపుడు ముందటఁ దఱుమక
యోజఁ దాను వారు నోసరించి
తాఁకుతో విదర్భధరణీశు సైన్యంబు
నాకులతను బొడిచి యతనిఁ జంపి.129
ఉ. కరితురగాదివస్తువులు గైకొని పాళులు పెట్టి యప్పు డ
న్నరవరకోటి కాబహుధనంబుల లోభము పుట్టఁ జేసి యొం
డొరువులతోఁ బెనంగి తెగి యుద్ధము సేయువిధం బొనర్చి యా
తురగతిఁ బొందునట్లుగ నదోషుఁడ పోలె నొనర్చె నేర్పునన్.130
వ. సకలరాజలోకంబును వికలతం బొంది చనినం దత్పరివారం
బెల్ల బెదరి వచ్చిన మధురవచనప్రదానాదులవలన వారిం
గూర్చుకొని బలసి భానువర్మ పగఁ దీర్చినవాఁ డై యిమ్మెయి
నాతనిం బ్రీతచిత్తుం జేసి యల్పధనంబునఁ దృప్తుం గావించి
నిజదేశంబునకుం బుచ్చిన వసంతభానుండు సమస్తవస్తు
సహితంబుగా విదర్భరాజ్యంబు చేకొని యుండె నిట వసు
రక్షితుండును భండనంబున మొగ తప్పి పట్టణంబునకుం జని