ఏకాదశాశ్వాసము
307
జనంబులు జడుం డవహితుం డకృపణుం డనకుండవలయునట్టి
వాక్పారుష్యదండార్థదూషణంబులవలనం బ్రవీణుం డగు
నట్లునుం గావించె.109
క. వ్యసనపరుం డై భూపా
లసుతుఁ[1]డు సంతతము నధికలౌల్యంబున వే
డ్క సలుపఁ దొడఁగెఁ బ్రజయుఁ ద
ద్రసానుభవకౌతుకమున రాజుం బోలెన్.110
క. నరు లెల్ల దుర్నయంబునఁ
దిరుగుట నొండొరులకీడు దెలుపంగా నె
వ్వరు లేమి భూమిలో వెలి
విరిసె నధర్మంబు యోగవిధ్వంసక మై.111
ఆ. బలీయుఁ డన ద నడఁచు వలచినయవి యెల్లఁ
బాడి లేక చేయుఁ బ్రభుజనంబు
వేళ వేచి యొరుని యాలి నర్థంబును
నపహరింతు రేచి యాగడీలు.112
క. అప్పుగొని మగుడఁ బెట్టరు
తప్పు పలుక శంక గొనరు తగుబేహారం
బెప్పటిపరివర్తనముల
చొప్పు చెఱిచి చూఱగొనఁగఁ జొత్తురు జనముల్.113
క. అవి యెల్లఁ గారణములుగ
నవనిం గలహములు పుట్టె నన్యోన్యవిచి
త్రవధంబులు చేసి నృపా
హవయోగ్యభటాలి యెల్ల నాఱడిఁ బోయెన్.114
- ↑ డనంతరము