296
దశకుమారచరిత్రము
ఉ. నీవు సధర్మవర్తి వని నీ కొక మే లొనరింపఁ గోరియే
పోవన కాని యిప్డు పరభూములఁ గ్రుమ్మరుచున్న యట్టి నా
పోవుట నిల్చు నిట్టి దొకపొం దని లేదది యట్ల యుండె స
ద్భావముతోడ నొక్కమరి భక్తిఁ దలంపుము మమ్ము నిచ్చలున్.57
వ. అని పరిజనుల నవలం బొమ్మని యతని డాయం బిలిచి
మంత్రాకారంబులుగాఁ గొన్ని కపటాక్షరంబు లుపదేశించి
యంతకుమున్న ఘటించియున్న యొక్క జిలిబిలిరక్షపూసయు
నిచ్చినం గృతార్థీభూతమనస్కుం డై నమస్కరించి మునీం
ద్రా! నన్నుం గొలువుగొని మీ రిందు నిలుచుట మా
కెల్ల పురుషార్థంబులు నని ప్రార్థించిన మా కంతపట్టునకు
భాగ్యంబు గలిగి యి ట్లయ్యెం గాని మావర్తనంబు గ్రామైక
రాత్రం బై యుండు ననిన నట్లన యగు నని మగుడం బలికి
వీడ్కొలిపినం జనియెఁ బదంపడి గతాగతజనంబులవలన
నతండు మంత్రిపురోహితసహితంబుగా నిక్కార్యంబు సేయ
నిశ్చయించు టెఱింగి నాచెప్పిన దినంబునకు ముందటినాఁటి
నిశాసమయంబున.58
క. ఏనును మదీయశిష్యుల
లోనుగ వంచించి కొలనిలోపల నుండన్
మానిసి కుండఁగ నయ్యెడు
మానముగాఁ దటమునం దమర్చి తగంగన్.59
వ. ఉపద్వారంబు సూక్ష్మంబుగాఁ గల్పించి యవ్వేకువన నతి
దూరంబగు నొక్కతీర్థంబునకుం బోవు నెపంబున శిష్యుం
గొనిపోయి గవ్యూతిమాత్రంబునం గాననంబులోనం గాడు