పుట:దశకుమారచరిత్రము.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

295

వ. అది యె ట్లం టేని రూపసిద్ధి యను నొక్కమంత్రంబు బ్రహ్మ
     రాక్షసభయంకరం బగు రక్షామణియు నీ కిచ్చెదఁ దన్మం
     త్రాభిమంత్రితంబైన యిక్కొలనిజలంబు నిష్కంటకంబుగా
     దర్వీకరమకరగ్రాహాదిదుష్టసత్వసముద్ధరణంబు సేయించి
     యాగామిశుక్లపక్షద్వితీయదినంబు నుపవసించి రక్షామణి
     లాంఛితశిరస్కుండ వై శశికళాసందర్శనంబు చేసి సప్త
     ఘటికానంతరంబ యష్టోత్తరసహస్రకరదీపికాపరివృతుండ వై
     యియ్యెడకుం జనుదెంచి పదశతత్రయమాత్రస్థాపితపరి
     వారుండ వై విలాసాలోకనంబును నపనయించి మంత్రపుర
     స్సరంబుగా సరోవరంబు చొచ్చి మునింగి యున్నభంగిన
     యూర్పు నిలుప నయ్యెడునంతసేపుం జపియించి పరిభూత
     మన్మథాటోపంబగు రూపంబు దాల్చి తదనంతరంబ నిజ
     గృహంబునకుం జని.53
క. ఇతరులతోఁ బలుకక య
     య్యతివకుఁ బొడచూపి పలుకు మంతటఁగోలెం
     బ్రతిదివసము రతిపతికిని
     రతిక్రియ నమ్మగువ నీకు రాగ మెనర్చున్.54
మ. ఇది నీకుం బ్రియమేని ప్రెగ్గడలతో నేకాంత మూహించి యొ
     ప్పిద మై యుండఁగ నాచరింపు మనుడున్ బేల్పాటు చిత్తంబునం
     దొదవన్ సమ్మద మొంది యియ్యకొని మాయోపాయజాలంబులం
     బొదువం బడ్డ నెఱింగి యాత్మముద ముప్పొంగంగ నే వానితోన్.55
వ. మఱియు ని ట్లంటి.56