పుట:దశకుమారచరిత్రము.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

267

     జ్జయినీపురంబు)కు వచ్చి యశనార్థియై తిరుగుచున్నం గని
     ధూమిని జనపతిపాలికిం జని యి ట్లనియె.91
క. నావిభుని మొండివానిం
     గావించినవాఁడు వచ్చి కపటాకృతితో
     నీవీట నున్నవాఁడు మ
     హీవల్లభ! వాని నేన యిప్పుడు గంటిన్.92
చ. అనవుడు మేదినీశ్వరుఁడు నాయమపల్కులు నిక్కువంబు కాఁ
     దనమడిలోపలం దలఁచి ధన్యకునిం దల గోసి వైవఁ బం
     చిన నది చూప నారెకులు చెచ్చెర నాతనిఁ బట్టి నిన్ను ని
     మ్మనుజవిభుండు చంపు మని మమ్ము నియుక్తులఁ జేసె నావుడున్.93
వ. వాఁడును మరణభయవిహ్వలితాంతఃకరణుం డయ్యును
     ధీరుండు గావున సముచితంబుగా ని ట్లనియె.94
క. చంపిన సరి లేదని చం
     పింపం దగునె? ధరిత్రిఁ బేద లనక తాఁ
     జంపెడిచోట విచారము
     పెంపేనియుఁ దలఁపవలదె? పృథివీపతికిన్.95
క. అనవుడు పైపాటునకున్
     మనమున శంకించి వానిమాట పతికి వా
     రును జెప్పి కొలువులోనికి
     గొనిపోయిన నతఁడు ధన్యకున కి ట్లనియెన్.96
క. తగునే? నీవు పతివ్రత
     మగని నకారణమ పాపమతి వై యమ్మై