పుట:దశకుమారచరిత్రము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

దశకుమారచరిత్రము

     [1](దెగఁబడి వికలాంగుని జే
     యఁగ ఛీ నీచేతు లెట్టు లాడె దురాత్మా!97
చ. అనవుడు ధన్యకుం డనె ధరాధిప! దీనియథార్థ మెన్నకే
     తునుమఁగఁ బంప నీతియె? యదోషుని, నైననతండు చెప్పినం)
     దునుముట నీతి గాన దయతోడఁ బతివ్రతభర్తఁ బిల్వఁగాఁ
     బనుపుము వాడు నావలనఁ బాపము పెట్టిన దీని కోర్చెదన్.98
క. అనినం బతి పనుపఁగఁ దో
     కొని వచ్చిన నతఁడు ధన్యకుని గని ననుఁ బ్రో
     చినయయ్య యనుచుఁ దత్పద
     వనజంబుల కెరఁగె మనుజవల్లభు మ్రోలన్.99
వ. ఇట్లు ప్రణమిల్లి మేదినీపతికిం దనతెఱంగు విన్నవించిన.100
ఆ. ధరణినాథుఁ డపుడు ధన్యకు నిర్దోషుఁ
     గా నెఱింగి వానిఁ గరుణ నేలి
     దుశ్చరిత్ర యైన ధూమిని నవమాన
     పఱచి యునిచెఁ గుక్కబానసమున.101
వ. అది కారణంబుగా నారీచిత్తంబు క్రూరం బయ్యె నని
     చెప్పి మఱియు ని ట్లంటి.102
సీ. అవనికిఁ దొడవైన ద్రవిళదేశములోని
                    కాంచీపురమునఁ బ్రకాశయశుఁడు
     శక్తికుమారాఖ్య సడిసన్న కోమటి
                    వెరవుపెంపునఁ గల వెలఁది వెదకి
     పరిణయంబుగఁ బూని పలుచోటులకు నేఁగి
                    యెఱుకల వెంట నిల్లిల్లు దూఱి

  1. ఈకుండలీకృతభాగము వ్రాఁతప్రతిలో లేనందునఁ బూరింపఁబడినది.