పుట:దశకుమారచరిత్రము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

255

     వైదేశికులకు సుఖకర
     మాదేశము వెలిసి చెప్పు మరుగఁగవలయున్.21
తరల. అనిన నిట్లని యేను బల్కితి నక్కటా! పరదేశ మీ
     వనితఁ దోడ్కొని పోవవచ్చునె? వచ్చునేని సహాయమై
     యనుప వచ్చెద మీకుఁ జిత్తసుఖావహంబుగ నియ్యెడన్
     మనుప నేర్చితినేని నేర్చెద మాట లన్నియు నేటికిన్.22
క. అని పలుకఁగ మృదునూపుర
     నినదము రశనాకలాపనినదము వనితా
     జనసరసవచనరచనా
     నినదంబును నిండె వర్ణనీయం బగుచున్.23
వ. ఆనినదం బాలించి చంద్రసేన యి ట్లనియె.24
తే. కందుకోత్సవమునకు భూకాంతపుత్త్రి
     వచ్చుచున్నది నాకుఁ బోవలయుఁ బిదపఁ
     గార్య మూహింత మిప్పు డక్కాంతఁ జూడ
     నిష్టమేని నాపజ్జన యేఁగుదెండు.25
వ. అనవుడు26
తే. ఏము దాని పిఱుందన యేఁగి రమ్య
     రంగతలమున కరిగి యారాజతనయం
     జూచుచుండితి మంత నాసుభగలీల
     నాదుహృదయంబులో నర్తనంబు సేసె.27
వ. అట్టిసమయంబున నపూర్వలక్షణాలంకృతంబైన యాకాంత
     నీక్షించి విస్మితాంతఃకరణుండ నై యాత్మగతంబున.28
సీ. లక్ష్మిహస్తమునకు లాంఛనం బబ్జంబు
                    హస్తంబ యబ్జ మీయబ్జముఖికి