పుట:దశకుమారచరిత్రము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

దశకుమారచరిత్రము

సీ. అనుచున్న యవసరంబున నొక్కకోమలి
                    చనుదెంచె వాడును సంభ్రమమున
     నెదురేఁగి వచనంబు హృదయంబు వికసింప
                    గమలాక్షి బిగియారఁ గౌఁగిలించి
     కొనివచ్చి చేరువఁ గూర్చుండి నాతోడ
                    నెంతయుఁ బ్రీతిమై నిట్టు లనియె
     నా ప్రాణమునకుఁ బ్రాణం బైనయది యిప్పు
                    డేను జెప్పిన చంద్రసేన సుమ్ము
తే. భీమధన్వుండు దినిన నా పేరికూర
     నంజ, నే నిది వెలిగాఁగ నాకు నొక్క
     నిమిష మేనియుఁ గడపంగ నేరరాదు
     ప్రాణములతోడి పొం దింకఁ బాయువాఁడ.18
చ. అనవుడు నాలతాంగి కుసుమాయుధసాయకసన్నిభంబు లై
     మనమునఁ బ్రాణవల్లభుని మాటలు నాటిన సంచలించి యి
     ట్లనియె మదర్థమై కులము నర్థముఁ గీర్తియు బాయఁ బెట్టి నీ
     యునికికి దోడు దైన్యముగ నొండు తలంపు దలంపఁగూడునే?19
వ. అదియునుం గాక యర్థదాసుండను సార్థవాహునకుం గోశ
     దాసుండనం బుట్టి నామీఁదికూర్మి కారణంబుగా వేశదాసుం
     డను హీననామంబు దాల్చి తిదియునుం జాలదే? నన్ను
     నీ కిష్టంబగు దేశంబునకుం దోడ్కొని పొ మ్మనిన సమ్మతించి
     మద్వదనం బాలోకించి యి ట్లనియె.20
క. ఏదేశంబు సమృద్ధం
     బేదేశము ధర్మబహుళ మేదేశము తా