దశమాశ్వాసము
253
క. నేమముతో నిజకాంతా
స్తోమంబును దానుఁ గొల్చె సోమాపీడా
నామాంకిత యగు దేవతఁ
గామితఫలదాయిఁ బుత్రకాంక్షాపరుఁ డై.13
వ. ఇట్లు గొల్చినం బరమేశ్వరి ప్రత్యక్షం బై నీకు నొక్క
పుత్త్రుండునుం బుత్త్రియు నుద్భవింపం గలవారు పుత్త్రికిం
బతి యైనవాని ప్రాపునం బుత్త్రుండు బ్రతుకం గలవాఁడు
పుత్త్రి యెవ్వనిం జూచి వలచె వాఁడె మగం డగు సప్తమ
వర్షంబు దొడంగి పాణిగ్రహణసమయంబు తుదిగాఁ
బ్రతివర్షంబును నీకూతురు నాకుం గందుకోత్సవంబు సేయం
గల దని పలికినం బ్రసాదం బని పోయి దేవీకృప నపత్య
ద్వయంబుం బడసి కొడుకునకు భీమధన్వుం డను నామం
బునుం గూతునకుం గందుకావతి యను పేరును బెట్టె నట్టి
కందుకోత్సవంబునకు నత్తరుణి దేవీగృహంబునకు వచ్చు
చున్న దని చెప్పి వెండియు ని ట్లనియె.14
తే. అధిపనందన నెచ్చెలి యైన చంద్ర
సేన యనియెడు పడఁతి నాజీవితేశ
దానిపై భీమధన్వుండు దగిలి యుండుఁ
గష్టచారిత్రుఁ డాతండు దుష్టబుద్ధి.15
వ. అతనిచరితం బ ట్లుండె.16
క. ఇచ్చటిసంకేతంబును
నచ్చేడియ నాకుఁ జెప్పె నది యింపెసఁగన్
వచ్చుట కెదుళ్ళు చూచెద
మచ్చరితం బివ్విధంబు మానవతిలకా!17