అష్టమాశ్వాసము
229
విధి కామపాలుని వెనువెంటఁ జనుదెంచి
సర్పరూపంబునఁ జంపెఁ జూడుఁ
తే. డనిన విని కొంద ఱానంద మంది రచట
కొంద ఱెంతయు శోకంబు బొంది రంత
నడలు గలయట్ల వేవేగ యరుగుదెంచి
కాంతుఁ గనుఁగొని గద్గదకంఠ యగుచు.73
క. లలన పతిపిదప నిలుచుట
కులనిందకుఁ గారణం బగుం గావున న
న్నలఁపక యీతని యెగ్గులు
దలఁపక యిమ్మనుఁడు చిచ్చు దయతో నాకున్.74
క. అని చెప్పి పుచ్చ జనపతి
యనుమతమున నంత్యమండనార్థముగా మ
జ్జనని నిజమందిరమునకు
జనకుం గొనిపోయి దర్భశాయిం జేసెన్.75
ఉ. అయ్యెడఁ బూర్ణచంద్రుఁడు సహాయుఁడుగా నతిగూఢచారివై
యొయ్యన చొచ్చి తల్లికి మహోత్సన మంద నమస్కరించి మా
యయ్యకు మంత్రతంత్రముల నభ్యుదయం బొనరించి వారికిం
దియ్యముమీఱ నే రిపు వధింపఁ గడంగినమాట లాడినన్.76
మ. కొడుకా! పుట్టిననాఁడు ని న్నదయతన్ ఘోరశ్మశానంబులో
నడురే యెవ్వరు గానకుండఁ బటునానాభూతసంఘంబు పా
ల్పడ నే వైచిన నన్నుఁ దల్లి యని సంభావించిర క్షింప ని
క్కడి కేలా? చనుదెంచి తిప్పు డనుచుం గన్నీట నూఱార్పుచున్.77