230
దశకుమారచరిత్రము
వ. మాతల్లి నన్ను గాఢాలింగనపూర్వకంబుగా మూర్థాఘ్రా
ణంబు సేసెఁ బూర్ణచంద్రుచేతం దనవృత్తాంతంబును మదీ
యోపాయంబుల నాపదలుం దలంగుటయుం బతికి నేర్పడం
జెప్పిన నతండును బునఃపునరాలింగనంబున నభినందించె న
ట్లయ్యిరువురు నానందరసభరితు లై యున్నంత సూర్యాస్త
మయం బగుటయు రాత్రిసమయంబు నగ్నిప్రవేశం బను
చితం బను నెపంబున నహితజనంబుల వంచించి మనకు
నియ్యెడ నెయ్యది కార్యం బని యాలో చించుచున్న రహ
స్యాలాపంబులలో నస్మదీయగృహప్రాకారంబున కనతి
దూరంబున సింహఘోషుశయ్యామందిరం బునికి విని దాని
చక్కటిం దెలియ నెఱింగి యనాయాసంబున వానిం బట్టు
కొను నుపాయంబు నిశ్చయించి యేనునుం బూర్ణ
చంద్రుండును.78
ఉ. కన్నము పెట్టి పెట్టి యెడఁ గాంచితి మే మొకభూగృహంబులోఁ
గన్నియపిండు గొల్వఁగ సుఖస్థితి నున్న లతాంగి నంత నా
యన్నులు నన్నుఁ జూచి మలయానలధూతలతావితానలీ
ల న్నిజగాత్రముల్ గడు వడంక భయంపడి నిల్చి రత్తఱిన్.79
ఉ. అం దొకవృద్ధకాంత వినయంబున నా కిలఁ జాఁగి మ్రొక్కి మే
మందఱ మాఁడువారము దయామతిఁ గావుము నావుడుం బ్రియం
బొందఁగ నమ్మృగేక్షణల నోడకుఁ డోడకుఁ డన్నఁ దేటి నీ
వెందుల కేఁగె దెవ్వఁడ వహీనపరాక్రమశాలి! చెప్పవే!80
వ. అనిన నయ్యవ్వకుం బూర్ణచంద్రుం డి ట్లనియె.81