228
దశకుమారచరిత్రము
ఉ. ఆఱడిగానిఁ దండ్రి సచివాగ్రణిఁ జేసినఁ గూర్మిసొంపునన్
మీఱి దురాశతన్ జెఱిచి మేటిగ రాజ్యము సేయఁజూచినం
బాఱునిఁ జంప దోస మను పల్కునకుంబతి యిద్దురాత్మునిం
గాఱియఁ బెట్టఁగాఁ దలఁచి కన్నులు పుచ్చఁగఁ బంచెఁ జెచ్చెరన్.68
వ. అనిపలుకు నవసరంబున.69
క. మ్రానిపై నుండి పడుటయ
కా నెల్లజనంబు దలఁపఁ గడు నేర్పున నే
నానాగము వైచిన నది
నే నడరం గఱచె జనకునిం గోపముతోన్.70
తే. చానఁ బుట్టినక్రందున మ్రాను డిగ్గ
నుఱికి సందడిలోపల దఱియఁ జొచ్చి
వెజ్జ నై మంత్రజలమున విషము మస్త
మునకు నెక్కించుటయుఁ దండ్రి మూర్ఛవోయె.71
వ. ఇవ్విధంబునం గపటమరణం బాపాదించి కృత్రిమమంత్రౌష
ధంబులు ప్రయోగించి నిర్విషంబు చేయంజాలమి భావించి
మెఱమెచ్చుల కి ట్లంటి.72
సీ. తొల్లి గైకొన్న మందులు మంత్రములు నేఁడు
పరికించి చూడ నిష్ఫలము లయ్యె
నేలినవానికి నెగ్గు దలంచిన
పాపంబు సేసేతఁ జూప కున్నె
చంపింప నొల్లక జననాయకుఁడు నేత్ర
యుగళంబు పుచ్చంగ నున్నచోట